Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపిక చేసిన ఐసీసీ
దుబారు : ఐసీసీ మ్యాచ్ రిఫరీగా భారత మాజీ క్రికెటర్ జిఎస్ లక్ష్మీ ఎంపికైంది. 2008-09లో దేశవాళీ సర్క్యూట్లో మ్యాచ్ రిఫరీగా నియమితులైన లక్ష్మీని ఐసీసీ తాజాగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానల్లోకి తీసుకున్నది. దీంతో ఐసీసీ తొలి మహిళా రిఫరీగా లక్ష్మీ రికార్డు సాధించింది. ఐసీసీ ప్రకటనతో జిఎస్ లక్ష్మీ తక్షణమే ఐసీసీ మ్యాచులకు రిఫరీగా వ్యవహరించవచ్చు. క్లారె పొలొసాక్ ఇటీవల మెన్స్ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన తొలి మహిళాగా నిలువగా... తాజాగా లక్ష్మీ రిఫరీగా ఎంపికైంది.
' ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రిఫరీ ప్యానల్లోకి ఎంపిక కావటం సంతోషంగా ఉంది. దీన్నో గొప్ప గౌరవంగా భావిస్తున్నా. భారత్లో క్రికెటర్గా, మ్యాచ్ అఫీసర్గా సుదీర్ఘ కెరీర్ నాది. అనుభవాన్ని అంతర్జాతీయ క్రికెట్లో మంచి కోసం ఉపయోగిస్తా' అని లక్ష్మీ తెలిపింది. జిఎస్ లక్ష్మీ మహిళల మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లకు భారత్లో రిఫరీగా వ్యవహరించింది.