Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ అజారుద్దీన్
హైదరాబాద్ : 2019 ప్రపంచకప్ను టీమ్ ఇండియా నెగ్గుతుందని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ' భారత్కు మంచి అవకాశం ఉంది. మెరుగైన జట్టు ఉంది. నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలింగ్ పిచ్లు ఎదురైతే, మనకు ఇబ్బందని అందరూ అంటున్నారు. కానీ భారత బౌలర్లు సైతం ప్రత్యర్థిని ఆలౌట్ చేయగలరు. మనకు ప్రపంచ శ్రేణి బౌలర్లు ఉన్నారు. మంచి జట్టుతో ప్రపంచకప్ నెగ్గకపోతే, నేనైతే నిరుత్సాహపడతాను. వరల్డ్కప్ రేసులో భారత్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత అవకాశాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియావి. మెగా ఈవెంట్లలో ఏమైనా జరగొచ్చు. మ్యాచ్ రోజు మెరుగ్గా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది. కొన్ని సార్లు నిరుత్సాహం తప్పదు. కానీ అది మన జట్టుతో కాదని నా భావన' అని అజారుద్దీన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ వేటను జూన్ 5న దక్షిణాఫ్రికాతో గ్రూప్ మ్యాచ్తో కోహ్లిసేన మొదలెట్టనున్నది.