Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడగలడు
- మ్యాచ్ ఫినిషర్గానూ రాణించగలడు
ముంబయి : ధోనీకి ప్రత్యామ్నాయంలో రెండో వికెట్కీపర్ స్థానంపై సుదీర్ఘ చర్చ అనంతరం దినేష్ కార్తీను బిసిసిఐ గత నెలలో ఎంపిక చేసింది. అయితే రెండో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని దినేశ్ కార్తీక్ను ఎంపిక చేయడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం స్పందించాడు. దినేశ్ కార్తీక్కు చాలా అనుభవం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా ఉందని... ఈ నేపథ్యంలోనే పంత్ను కాదని అతన్ని సెలెక్ట్ చేశామని కోహ్లీ తెలిపాడు. ప్రధాన వికెట్ కీపర్గా ధోనీ వ్యవహరిస్తాడని... అనివార్య కారణాల వల్ల ధోనీ ఏదైనా మ్యాచ్లో ఆడలేకపోయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా మరొకరు అవసరమైన పక్షంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వస్తాడని చెప్పాడు. అంతేగాక మ్యాచ్ ఫినిష్ చేయడంలో కార్తీక్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని కూడా కోహ్లీ చెప్పుకొచ్చాడు.