Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్టల్ : పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలోనూ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(151) సెంచరీతో కదం తొక్కగా... ఆసిఫ్ అలీ(52) అర్ధసెంచరీ చేశాడు. వోక్స్కు నాలుగు, కుర్రన్కు రెండు వికెట్లు దక్కాయి. బెయిర్స్ట్రో(128), జాసన్ రారు(76) తొలి వికెట్కు 17 ఓవర్లలో 159 పరుగులు జతచేయడంతో ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 4 వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. జునైద్, వాసిమ్, అష్రఫ్లకు ఒక్కో వికెట్ దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెయిర్స్ట్రోకు దక్కింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యతలో నిలవగా... తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది.
కపిల్ రికార్డును తిరగరాసిన ఇమాముల్
పాకిస్థాన్ యువ ఆటగాడు ఇమాముల్-హక్ తన అద్వితీయ బ్యాటింగ్ ప్రదర్శనతో కపిల్ రికార్డును తిరగరాశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఓ వన్డేలో 150కి పైగా పరుగులు చేసిన పిన్నవయసు క్రికెటర్గా కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును హక్ తన పేరిట లిఖించుకున్నాడు. కపిల్ 1983 వరల్డ్కప్లో జింబాబ్వే జట్టుపై అజేయంగా 175 పరుగులు చేశాడు. అప్పుడు కపిల్ వయసు 24 సంవత్సరాలు కాగా, ఇప్పుడు 23 ఏళ్ల హక్ తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే మ్యాచ్లో 131 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డపై 150 ప్లస్ స్కోరు చేసిన పిన్నవయస్కుడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకున్నాడు.