Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్లో అవినీతిని కట్టడి చేసేందుకు..
- వార్మ్అప్ మ్యాచ్ నుంచే ఆటగాళ్లపై డేగ కన్ను
నవ తెలంగాణ క్రీడాప్రతినిధి
ఇంగ్లాండ్ వేదికగా 30 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీపై నిఘా పెట్టాలని ఇటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్ణయించింది. ప్రతి టీమ్కు ఒక అవినీతి నిరోధక అధికారి (యాంటి కరప్షన్ ఆఫీసర్)పర్యవేక్షించనున్నారు. వీరిన ఐసీసీ నియమించనున్నది. గతంలో ఏ టోర్నమెంట్కూ లేనివిధంగా ఐసీసీ ఈ తరహా వ్యవస్థను సమకూర్చనున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అవినీతి..ఫిక్సింగ్..బెట్టింగ్ లాంటి చట్ట వ్యతిరేకమైన వాటిని కట్టడిచేయటం. ఇప్పటి వరకు ఐసీసీ ఈ తరహా మల్టీ నేషన్ టోర్నమెంట్లో ప్రతి వేదికలకు అవినీతి అధికారులను నియమించాలి. ఏ వేదికపై ఆడే జట్టు అయినా..వారి వెంట అవినీతి అధికారి సమన్వయంగా వ్యవహరిస్తాడు.. టీమ్తో పాటు యాంటీ కరప్షన్ ఆఫీసర్ కలిసిఉండటంతో..ఎలాంటి అక్రమ చర్యనైనా ఇట్టే పసిగట్టవచ్చని ఐసీసీ భావిస్తున్నది. క్రికెటర్లు ఎలాంటి అడ్డదారులు తొక్కినా..ఎలాంటి అనుమానాలున్నా కూడా ఆ అధికారి గమనించటంతో సులువు అవుతుందని కౌన్సిల్ అంచనా. గతంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచుల్లో క్రికెటర్లపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. క్రికెటర్లను బుకీలు,మాఫియాడాన్లు శాసించి కోట్లల్లో చేతులు మారుతున్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. తద్వారా మ్యాచ్ ఫలితాలు తారుమారయ్యారన్న వాదనలు ఉన్నాయి. ఇలా అడ్డదారుల్లో బుక్కయిన ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకున్న విషయం విదితమే. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరై ందేనని క్రీడాభిమానులు అంటున్నారు. అయితే అవినీతి కట్టడి కోసం నియమించే నియంత్రణ అధికారులు ఎంతవరకు సఫలమవుతుందో వేచిచూడాల్సిందే.