Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ విజేత జట్టుకు ప్రైజ్మనీ రూ.28 కోట్లకుపైనే..
లార్డ్స్: మే 30 నుంచి ఇంగ్లండ్, వేల్స్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2019 వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇందులో గెలిచి కప్ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకుపైగానే. రన్నరప్కు రెండు మిలియన్ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతాయి. లీగ్ దశలో గెలిచే ప్రతి మ్యాచ్కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. ఇక లీగ్ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది.
మొత్తం 46 రోజుల ప్రపంచకప్ సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. 45 మ్యాచులు రౌండ్రాబిన్ పద్ధతిలో జరగనున్నాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. లీగ్దశ ముగిసేసరికి ఎవరైతే తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. జులై 9న ఎడ్జ్బాస్టన్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో ఒక సెమీఫైనల్, 11న ఎడ్జ్బాస్టన్లోని బర్మింగ్హామ్లో మరో సెమీఫైనల్ జరుగుతుంది. జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్లో తుదిపోరు ఉండనుంది.
20 ఏండ్ల తర్వాత..
ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఇప్పటివరకు 1975, 1979, 1983, 1999లో ప్రపంచకప్ వేడుకలు నిర్వహించాయి. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడ ఈ మెగా ఈవెంట్ జరగబోతుంది. ఇప్పటివరకు ప్రపంచకప్ విజేతల్లో ఆసీస్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు, వెస్టిండీస్, భారత్ రెండేసిసార్లు, పాక్, శ్రీలంక జట్లు చెరోసారి ఛాంపియన్లుగా నిలిచాయి.