Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియాఖండ ప్రపంచకప్ కంగారుల కైవసం
- చేతన్ శర్మ హ్యాట్రిక్, గవాస్కర్ ఏకైక సెంచరీ నమోదు
- 1987 ప్రపంచకప్ అవలోకనం
- ప్రపంచకప్ 12 రోజుల్లో
నవతెలంగాణ స్పోర్ట్స్ డెస్క్
ఇంగ్లాండ్ తొలి మూడు ప్రపంచకప్లకు ఆతిథ్యమివ్వగా... 1987 ప్రపంచకప్కు భారత్, పాకిస్తాన్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. 1983 ప్రపంచకప్ను టీమిండియా గెల్చుకోవడం, సెమీస్కు పాకిస్తాన్ చేరడం... వీటన్నింటి దృష్ట్యా నాల్గో ప్రపంచకప్కు నిర్వహణ బాధ్యత ఆసియా ఖండ జట్లకు దక్కింది. తొలి రెండు ప్రపంచకప్లను గెల్చిన వెస్టిండీస్ కూడా టోర్నీ నిర్వహణకు ముందుకు వచ్చినా... ఐసిసి కరేబియన్ దేశాన్ని కాదని భారత్ వైపు మొగ్గింది. 1987 టైటిల్ స్పాన్సర్షిప్కు ధీరూభారు అంబాని(రిలయన్స్ సంస్థలు) ముందుకు రావడంతో ఈ ట్రోఫీకి 'రిలయన్స్ ప్రపంచకప్'గా నామకరణం చేశారు. భారత్లో నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లోకి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ప్రవేశించగా.. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో జరిగిన ఫైనల్లో అలెన్ బోర్డర్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు కేవలం 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచి తొలిసారి టైటిల్ను ముద్దాడింది. ఆతిథ్య దేశాలైన భారత్, పాకిస్తాన్జట్లు సెమీస్లో పరాజయాన్ని చవిచూడగా... వెస్టిండీస్ జట్టు లీగ్ దశకే పరిమితం కావడం గమనార్హం.
గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు... గ్రూప్-బిలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఉన్నాయి. తొలి మూడు ప్రపంచకప్ టోర్నీలు 60 ఓవర్లపాటు సాగగా... భారత్లో నిర్వహించిన ఈ ట్రోఫీ 50 ఓవర్లకు కుదించారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన టోర్నీ తొలిమ్యాచ్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. అక్టోబర్ 9న ఆస్ట్రేలియాతో ఉత్కంఠ భరితంగా సాగిన తొలిమ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడింది. ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేయగా... భారత్ 49.5 ఓవర్లలో 269 పరుగులకు పరిమితమైంది. చివరి రెండు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో మణిందర్ సింగ్ను స్టీవ్ వా బౌల్డ్ చేశాడు. అక్టోబర్ 14న న్యూజిలాండ్పై భారత్ 16 పరుగుల తేడాతో గెలుపొందగా... 17న జింబాబ్వేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 22న ఆస్ట్రేలియాపై 56 పరుగుల తేడాతో... 26న జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఇక 31న న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం విశేషం. ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేయగా... భారత్ 32.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో భారత్కు చెందిన చేతన్ శర్మ హాట్రిక్ నమోదు చేయగా... సునీల్ గవాస్కర్(103 నాటౌట్) కెరీర్లో చేసిన ఏకైక సెంచరీని న్యూజిలాండ్పై నమోదు చేయడం గమనార్హం.
లీగ్ మ్యాచ్ల అనంతరం గ్రూప్-ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియా, గ్రూప్-బి నుంచి పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరాయి. ఆతిథ్య దేశాలు రెండూ లీగ్ దశలో ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. తొలి సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ 18 పరుగుల తేడాతో ఓడగా.. రెండో సెమీస్లో భారత్ 35 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తయ్యింది. నవంబర్ 8న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా తొలిగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేయగా... ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ టోర్నీ స్పాన్సర్షిప్కు రిలయన్స్ సంస్థలు రూ.9 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.