Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశవాళీ క్రికెట్లోనూ త్వరలో డీఆర్ఎస్ రాబోతున్నది. అంతర్జాతీయ మ్యాచులకు డీఆర్ఎస్ అక్కర్లేదని చాలా కాలం వ్యతిరేకించిన బీసీసీఐ, ఇప్పుడు సాంకేతికతను దేశవాళీ సీజన్కు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దేశవాళీ క్రికెట్ జట్ల కెప్టెన్లు, కోచ్ల సమావేశం ముంబయిలో శుక్రవారం ముగిసింది. రంజీ ట్రోఫీని మరింత ఆకర్షణీయంగా, మెరుగైన రీతిలో నిర్వహించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. కర్ణాటక, సౌరాష్ట్ర సెమీఫైనల్లో చతేశ్వర్ పుజార కేంద్రంగా నడిచిన డీఆర్ఎస్ వివాదం.. ఇప్పుడు రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచులు సహా టెలివిజన్ ప్రసారాలు ఉన్న మ్యాచులకు డీఆర్ఎస్ అమలు చేసే నిర్ణయానికి దారితీసింది. అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతికి కెప్టెన్లు, కోచ్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే దేశవాళీ క్రికెట్ నిబంధనల్లో డీఆర్ఎస్ భాగం కానుంది.