Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ ఆటగాళ్ల జాలీ హాలీడే
ముంబయి : ఇంగ్లాండ్, పాకిస్థాన్లు ద్వైపాక్షిక సిరీస్లో బిజీగా ఉన్నాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్ ముక్కోణపు వన్డే సిరీస్తో మ్యాచ్ ప్రాక్టీస్ చేశాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు జాతీయ శిబిరాలకు ముందు వార్మప్ వన్డేలతో వరల్డ్కప్కు సన్నాహక సమర శంఖం ఊదేశాయి. ప్రపంచకప్ జట్లు క్రికెట్తో మునిగిపోగా.. ఫేవరెట్ భారత్ మాత్రం నేరుగా ఇంగ్లాండ్కు బయల్దేరనున్నది. మెగా ఈవెంట్కు ముందు ఎటువంటి శిక్షణ శిబిరం లేకుండానే విమానం ఎక్కనున్నది. మే 12న ఐపీఎల్ ఫైనల్స్ ముగియగా.. ఆటగాళ్లు విశ్రాంతి కావాలని కోరారు. సహాయక సిబ్బంది సైతం ఎటువంటి సన్నాహక శిబిరం అవసరం లేదని చెప్పగా.. ప్రపంచకప్ జట్టులోని ఆటగాళ్లు ఇప్పుడు విహార యాత్రల్లో సన్నిహితులతో గడుపుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రేగులో ఉండగా.. రోహిత్ శర్మ భార్యతో కలిసి మాల్దీవుల్లో సేద దీరుతున్నాడు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ గోవాలో గడుపుతున్నాడు. మిస్టర్ కూల్ ఎం.ఎస్ ధోని ఎప్పట్లాగానే ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు!. మే 30న ఆరంభం కానున్న వరల్డ్కప్లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనున్నది. మే 22న టీమ్ ఇండియా బ్రిటన్ బయల్దేరనుండగా.. అంతకుముందు రోజు ఆటగాళ్లు ముంబయికి చేరుకోనున్నారు.