Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనీస్ తైపీ జంటపై ఘన విజయం
- రోజర్స్ కప్
టోరంటో (కెనడా) : భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మరో టైటిల్ విజయం దిశగా దూసు కెళ్తోంది. ఇటీవల వింబుల్డన్ వుమెన్స్ డబుల్స్ చాంపియన్గా నిలిచిన సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి రోజర్స్ కప్ టోర్నీ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్లో చైనీస్ తైపీ జోడి హౌ చింగ్ చాన్, యుంగ్ జన్ చాన్ జోడిపై సానియా, హింగిస్ వరస సెట్లలో విజయం సాధించారు. 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో 6-4, 6-2తో అన్సీడెన్ చైనీ స్ తైపీ జంటను టాప్ సీడ్ సానియా జోడి మట్టికరిపించింది. ఫైన ల్స్కు చేరాలంటే నేడు జరిగే సెమీస్ పోరులో నాల్గో సీడ్ కరొలిన్ గార్సి యా, కఠారినా శ్రేబోట్నిక్ జోడిని సానియా, హింగిస్ ఓడించాల్సి వుంది.