Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ మాజీ కెప్టెన్ అబ్బాస్
కరాచీ : 2019 వన్డే ప్రపంచకప్లో భారత్కు మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ట్రంప్ కార్డ్ అవుతాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్లు సెమీఫైనల్స్ రేసులో ముందున్నాయని చెప్పిన అబ్బాస్.. జట్టులో ధోని ఉండటం భారత్ అదృష్టమని అన్నాడు. ' క్రికెట్ మేధావి ఎం.ఎస్ ధోని అండ భారత్కుంది. ఆటను అర్థం చేసుకునే నైపుణ్యం అద్భుతం. రెండు సార్లు భారత్కు ప్రపంచకప్ సాధించాడు. జట్టులో ధోని ఉండటం కెప్టెన్, కోచ్లకు ఎంతో ఉపయోగం. ప్రపంచకప్లో భారత్కు ధోని ట్రంప్ కార్డ్ అవుతాడు' అని అబ్బాస్ అన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్ ఇండియా మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ సైతం ధోనిపై ప్రశంసలు గుప్పించాడు. ' ఏది ఏమైనా సరే, ధోని కావాలి. అతడు ఏం చెప్పినా మేం పాటిస్తాం. బౌలింగ్లో ఏమైనా తప్పులు చేస్తే వెంటనే చెప్పేస్తాడు. మేం టీమ్ ఇండియాలోకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడూ అదే విధంగా ఉంది' అని చాహల్ తెలిపాడు. వికెట్ల వెనకాల నిల్చోని, బ్యాట్స్మన్ కదలికలు దగ్గర్నుంచి పరిశీలించే ధోని.. స్పిన్నర్లకు విలువైన చిట్కాలు అందిస్తాడు. మహి సూచనలతో బంతులేసి భారత స్పిన్నర్లు వికెట్ల వేట సాగించటం అభిమానులకు తెలిసిందే.