Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహచరుల సపోర్టు కావాలి
- ప్రపంచకప్పై సచిన్ టెండూల్కర్
ముంబయి : ఒక్క ఆటగాడి మెరుపులతో ప్రపంచకప్ నెగ్గలేమని, జట్టులోని అందరి సహకారం అవసరమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 1996, 1999, 2003లో సచిన్ టెండూల్కర్పై ఆధారపడినట్టు, ఇప్పుడు భారత్ విరాట్ కోహ్లిపై అతిగా ఆధారపడుతోందా? అని అడుగగా.. ' ప్రతి మ్యాచ్లోనూ ఒకరిద్దరు ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటారు. కానీ జట్టు మద్దతు లభించనిదే ఏమీ చేయలేం. ఒక్క ఆటగాడితో టోర్నీ గెలువలేం. కీలక సమయాల్లో ఇతర ఆటగాళ్లు ముందుకు రాకపోతే, ఏమీ చేయలేం. జట్టు మద్దతు లభించకపోతే, అది అతి పెద్ద నిరుత్సాహం' అని సచిన్ బదులిచ్చాడు. భారత బ్యాటింగ్ లైనప్లో నం.4పై ఆందోళన అవసరం లేదన్నాడు. 'భారత్కు మంచి బ్యాట్స్మన్ ఉన్నారు. నం.4లో మెరుగ్గా ఆడగలరు. నం.4 కేవలం ఓ అంకె, దాన్ని సర్దుకోవచ్చు. ప్రత్యేకించి నాలుగో స్థానం ఓ సమస్య కాదు. నం.4, 6, 8 బ్యాట్స్మన్ బాధ్యత ఏమిటో తెలిసేంత క్రికెట్ మనోళ్లు ఆడేశారు. పరిస్థితులను అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానం. మ్యాచ్ పరిస్థితుల ఆధారంగా ఎవరిని ఆడించాలనేది తేల్చుకోవాలి. అయితే, రెండు కొత్త బంతులతో బౌలర్ల కష్టాలు పెరిగాయి. ఓ జట్టు 350 పరుగులు చేస్తే, ఆ స్కోరును 45 ఓవర్లలోనే ఛేదిస్తున్నారు. రెండు కొత్త బంతుల నిబంధనతో వన్డేల్లో రివర్స్ స్వింగ్ కనుమరుగు అయిపోయిం దని' సచిన్ పేర్కొన్నాడు.