Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ ప్రీ ప్రపంచకప్ షెడ్యూల్
ముంబయి : ముచ్చటగా మూడోసారి భారత్కు ప్రపంచకప్ను తీసుకొచ్చేందుకు టీమ్ ఇండియా బుధవారమే ఇంగ్లాండ్కు చేరుకు న్నది. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ వేదిక సౌతాంప్టన్కు చేరుకునేందుకు పది రోజులు ముందుగానే భారత్ బ్రిటన్లో కాలుమోపింది. మే 23తో మొదలు కుని, సౌతాంప్టన్కు చేరుకునే వరకూ భారత్ ప్రతి రోజు బిజీ షెడ్యూల్తో గడపనుంది. అధికారిక ఫోటో షూట్స్, ఐసీసీ వర్క్ షాప్స్, టైన్రింగ్, వార్మప్స్, మీడియా సమావేశాలు, బ్రిటన్ రాణితో తేనీటి విందు వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోనుంది. ప్రపంచకప్లో తొలి మ్యాచ్కు ముందు భారత్ షెడ్యూల్ ఇదే.
మే 23 : విరామ రోజు. పూర్తి జట్టు సమావేశం తర్వాత టీమ్ మేనేజ్మెంట్ భేటి. అన్ని విషయా లపై సుదీర్ఘ చర్చ, షెడ్యూల్పై ఓ అవగాహన.
మే 24 : ప్రపంచకప్ జట్ల కెప్టెన్ల మీడియా సమావేశం, ఐసీసీ యాంటీ కరప్షన్, యాంటీ డోపింగ్ కార్యశాలకు విరాట్ కోహ్లి హాజరు. అదే రోజు టీమ్ ఇండియా పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్. అధికారిక ఫోటో షూట్.
మే 25 : న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్. మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభం.
మే 26 : రోడ్డు మార్గంలో కార్డిఫ్కు ప్రయాణం. విరామం అనం తరం, తొలి వార్మప్ మ్యాచ్పై జట్టు సమీక్ష సమావేశం.
మే 27 : మీడియా సమావేశం అనంతరం, కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో ట్రైనింగ్ సెషన్. టీమ్ మేనేజ్మెంట్, సీనియర్ క్రికెటర్లతో సహాయక సిబ్బంది సమావేశం.
మే 28 : సోఫియా గార్డెన్స్లో బంగ్లాదేశ్తో రెండో వార్మప్ మ్యాచ్. మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభం.
మే 29 : తొలి మ్యాచ్ వేదిక సౌతాంప్టన్కు జట్టు పయనం. బకింగ్హామ్ ప్యాలెస్లో బ్రిటన్ రాణితో గౌరవ తేనీటి విందుకు విరాట్ కోహ్లి హాజరు.
మే 30 : సౌతాంప్టన్లో టీమ్ ఇండియాకు పూర్తి విరామ రోజు .
మే 31 : ప్రపంచకప్ తొలి సన్నాహక ప్రాక్టీస్ సెషన్. అంతకు ముందు, మీడియా సమావేశం.