Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్తో వార్మప్ మ్యాచ్ నేడు
- మ.3 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
లండన్ : ప్రపంచకప్ వేటకు బ్రిటన్కు చేరుకున్న మూడు రోజుల్లోనే టీమ్ ఇండియా సమర సన్నాహానికి సిద్ధమైంది. ప్రాక్టీస్ సెషన్లో అప్పుడే నిమగమైన కోహ్లిసేన నేడు వరల్డ్ కప్ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్12 నుంచి నేరుగా ప్రపంచకప్కు పయనమైన టీమ్ ఇండియాకు ఇది మంచి మ్యాచ్ ప్రాక్టీస్. ధోని, రోహిత్, పాండ్య, జడేజా, బుమ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్లో ఆడారు. కానీ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం ఐపీఎల్ లీగ్ దశ తర్వాత మైదానంలో అడుగు మోపలేదు. వరల్డ్ కప్ మైకంలోకి వచ్చేందుకు వార్మప్ మ్యాచ్ ఉపయోగపడుతుంది. అన్నింటికి మించి, తుది జట్టు కూర్పుపై ఓ అవగాహన వచ్చేందుకు కోహ్లి వార్మప్ మ్యాచ్లను వినియోగించనున్నాడు. బ్యాటింగ్ లైనప్లో నం.4పై ఎనలేని చర్చ జరుగుతోంది. ఆల్రౌండర్ విజరు శంకర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా న్యాయం చేయగలడా? భారీ భాగస్వామ్యాలు నిర్మించగలడా? అనే సందేహాలకు వార్మప్ మ్యాచ్లో సమాధానం లభించనుంది.
న్యూజిలాండ్లో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథిలు వేగంగా బంతులు సంధించగలరు. వీరిపై ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేయాల్సిన సందర్భాల్లో ఇంగ్లీష్ పిచ్లపై సీమర్లను ఎదుర్కొవటంపై మన బ్యాట్స్మెన్కు ఓ అవగాహన వస్తుంది. కివీస్లో వరల్డ్ క్లాస్ హిట్లర్లు, ఆల్రౌండర్లు ఉన్నారు. రాస్ టేలర్, మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో సహా క్లాస్ బ్యాట్స్మన్ విలియమ్సన్ను నిలువరించటం మన బౌలర్లకు తొలి పరీక్ష. ప్రపంచకప్ టైటిల్ రేసులో నిలిచినా, లేకపోయినా న్యూజిలాండ్ ఎప్పటికీ బలమైన జట్టే. తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్తో కావటంతో కీలక సమస్యలకు కివీస్పై సమాధానం రాబట్టాలని కోహ్లి భావిస్తున్నాడు.