Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ : భారత షట్లర్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పి.వి సింధు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తిరుగులేని విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ మూడు గేముల మ్యాచ్లో మలేషియా షట్లర్పై ప్రతీకార విజయం సాధించాడు. 28 నిమిషాల్లో ప్రీ క్వార్టర్స్కు చేరుకున్న సింధు.. 21-14, 21-9తో చౌరున్నిశా (ఇండోనేషియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఇండోనేషియా అమ్మాయి సింధుకు ఏమాత్రం పోటీనివ్వలేదు. నేడు ప్రీ క్వార్టర్స్లో థారులాండ్ షట్లర్ నిచనాన్ జిందాపాల్తో సింధు తలపడుతుంది. మలేషియా షట్లర్ లీ జి జియాపై 21-15, 16-21, 21-12తో సమీర్ వర్మ ప్రతీకారం తీర్చుకున్నాడు. మెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నాడు. బి. సాయిప్రణీత్ 21-16, 21-14తో డాంగ్ లీ (కొరియా).. పారుపల్లి కశ్యప్ 21-16, 21-15తో సుపన్యు (థారులాండ్)పై తొలి రౌండ్లో గెలుపొందారు. మెన్స్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 21-12, 21-16తో ముందంజ వేయగా.. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంటకు 14-21, 13-21తో పరాజయం ఎదురైంది. హెచ్.ఎస్ ప్రణరు 18-21, 19-21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఫిట్నెస్ కారణాలతో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైంది.