Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత బోర్డుపై గవాస్కర్ విమర్శ
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్లో భారత షెడ్యూల్పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో అన్ని జట్లు రెండో మ్యాచ్ ఆడేసిన తర్వాత భారత్ ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ఆడటంపై అభిమానులు, మాజీ క్రికెటర్ల అసంతృప్తికి కారణమైంది. జస్టిస్ లోధా కమిటీ ఐపీఎల్కు, అంతర్జాతీయ షెడ్యూల్కు 15 రోజుల విరామం ఉండాలని సూచించింది. ఆ విధంగా చూసినా మే 27 నాటికి భారత్ అంతర్జాతీయ మ్యాచ్లో ఆడవచ్చు. కానీ జూన్ 5 వరకూ భారత్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. సునీల్ గవాస్కర్ ఈ అంశంపై బోర్డును తప్పుబట్టాడు. ఒక రోజు విరామంతో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లతో ఆడాల్సి రావటంపైనా సన్నీ ప్రశ్నించాడు. అంతర్గత విభేదాల కారణంగా ప్రపంచకప్ షెడ్యూల్ను బీసీసీఐ నిశితంగా పరిశీలించి ఉండకపోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇటువంటి షెడ్యూల్ మెగా ఈవెంట్లో మేలు చేయదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.