Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమానుల అసంతృప్తి!
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్లో బుధవారం భారత వరల్డ్కప్ వేట ఆరంభమైంది. వన్డే క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లి సారథ్యంలో టీమ్ ఇండియా మూడో సారి విజేతగా నిలిచేందుకు రేసులో దూసుకెళ్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విరాట్ కోహ్లి ఛాయచిత్రాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సింహాసనంపై రాజసంతో కూర్చున్న విరాట్ కోహ్లి తలపై కిరీటం, చేతిలో బ్యాట్ బంతి, బీసీసీఐ రంగుల్లో అలంకరణ దుస్తులతో వెలిగిపోతున్నాడు. ఈ ఫోటోను ఐసీసీ పోస్ట్ చేయగా భారత అభిమానులు పండుగ చేసుకోగా.. ప్రపంచ క్రికెట్ అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. బీసీసీఐ ప్రచార సంస్థ మాదిరి ఐసీసీ వ్యవహరిస్తుందని ఒకరు కామెంట్ చేయగా, ప్రపంచకప్లో భారత్ ఒక్కటే ఆడటం లేదని మరో అభిమాని చురకంటించాడు. అభిమాన విరాట్ను సింహాసనంపై క్రికెట్ రాజుగా చూసి భారత అభిమానులు విపరీతమైన లైక్లు కొడుతున్నారు.