Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. బుధవారం తొలిరౌండ్ పోటీల్లో గెలిచి రెండోరౌండ్లోకి చేరిన భారత షట్లర్లు రెండోరోజు నిరాశపరిచారు. మహిళల సింగిల్స్లో 2వ సీడ్గా బరిలోకి దిగిన పివి సింధు వరుససెట్లలో పరాజయాన్ని చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్లో 6వ సీడ్గా బరిలోకి దిగిన సమీర్తోపాటు సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్ జోడీ రంకిరెడ్డి-చిరాగ్శెట్టి జోడీలు ప్రత్యర్ధుల చేతుల్లో సునాయాసంగా ఓడారు. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో పివి సింధు 19-21, 18-21 పాయింట్ల తేడాతో జిందాపోల్(థారులాండ్) చేతిలో కేవలం 49 నిమిషాల్లోనే పరాజయాన్ని చవిచూసింది. తొలిసెట్లో 1-5తో వెనుకబడిన సింధు... ఆ తర్వాత పుంజుకొని అర్ధభాగానికి 11-9 ఆధిక్యతను సంపాదించింది. ఆ తర్వాత జిందాపోల్ చెలరేగి ఆడి 16-12 ఆధిక్యతను సంపాదించింది. ఆ తర్వాత ఇరువురు షట్లర్లు 19-19 స్కోర్తో నిలిచారు. కానీ చివరి రెండు పాయింట్లను జిందాపోల్ సాధించి తొలి గేమ్ను ముగించింది. ఇక రెండోసెట్లోనూ 14-11 ఆధిక్యతను నిలిచిన సింధు ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. ఇరువురు షట్లర్లు 18-19 పాయింట్ల వద్ద ఉన్న దశలో జిందాపోల్ మరోసారి రెండు వరుస పాయింట్లను గెలి మ్యాచ్ను ముగించింది. ఇక సమీర్వర్మ 16-21, 21-7, 13-21 పాయింట్ల తేడాతో వాంగ్-జు-వురు(చైనీస్ తైపీ) చేతిలో... సాయి ప్రణీత్ 23-25, 9-21 పాయింట్ల తేడాతో 2వ సీడ్ ఆంటోనీ చేతిలో ఓడారు. మరో మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 17-21, 22-20, 14-21 పాయింట్ల తేడాతో ఒలింపిక్ మాజీ ఛాంపియన్ లిన్-డాన్(చైనా) చేతిలో ఓడాడు.