Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్టింగ్టన్ : సుదీర్ఘ స్వదేశీ సీజన్ తర్వాత కోహ్లిసేన తొలుత న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఇటీవల భారత ఈ ఏడాది స్వదేశీ సీజన్ షెడ్యూల్ విడుదల చేసింది. భారత్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత.. కోహ్లిసేన న్యూజిలాండ్కు పయనం కానుంది. అక్కడ ఐదు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్లు ఆడనుంది. జనవరి 24న తొలి టీ20 జరుగుతుంది. ఫిబ్రవరి 21-25న వెల్టింగ్టన్లో తొలి టెస్టు, ఫిబ్రవరి 29-మార్చి 4న క్రైస్ట్చర్చ్లో రెండో టెస్టు జరుగుతాయి. టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. భారత గణతంత్య్ర దినోత్సవం నాడు రెండో టీ20 మ్యాచ్ను ఈడెన్పార్క్లో షెడ్యూల్ చేశారు. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కివీస్ బోర్డు సిద్ధమైంది. భారత్తో సిరీస్కు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో న్యూజిలాండ్ ఆడనుంది. భారత్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.