Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ స్థానంపై గవాస్కర్, గంభీర్, పీటర్సన్
న్యూఢిల్లీ : భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ బొటనవేలికి ఫ్రాక్చర్ కావటం, వెంటనే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపైకి చర్చ మళ్లింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం ధావన్ను పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ శిఖర్ ధావన్ ప్రపంచకప్కు దూరమైతే ఎవరిని ఎంపక చేయాలనే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. దిగ్గజ సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్లు రిషబ్ పంత్కు ఓటేయగా.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం తెలుగు తేజం అంబటి రాయుడు వైపు మొగ్గుచూపాడు. ' ధావన్ స్థానంలో రాయుడిని ఎంపిక చేయకుంటే అతడి కెరీర్ ముగిసినట్టే. వన్డేల్లో 45 సగటు ఉండి, ప్రపంచకప్ జట్టులో ఉండకపోవటం నిరుత్సాహానికి గురి చేస్తుంది. ప్రపంచకప్ పిలుపు అందకుంటే అతడు బ్యాగ్ సర్దుకోవటం మేలు. ఇక ఐపీఎల్పై ఫోకస్ చేస్త సరిపోతుంది' అని గంభీర్ అన్నాడు. ' శిఖర్ ధావన్ దూరమైతే, రిషబ్ పంత్కు పిలవాలి' అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ' ధావన్ స్థానం పంత్దే. హాట్ ఐపీఎల్ ఫామ్లో ఉన్నాడు. ప్రపంచకప్ జట్టులో చోటుకు ఎందుకు అర్హుడో చూపించాలని తపన పడుతున్నాడు. కానీ ధావన్ మూడు వారాల్లో కోలుకుంటాడని వైద్యులు చెబితే, నేను అతడి కోసమే ఎదురుచూస్తాను' అని గవాస్కర్ అన్నాడు.