Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ధావన్ స్టాండ్బైగా ఎంపిక
-లండన్ బయల్దేరిన రిషబ్
ముంబయి : వికెట్ కీపింగ్ నైపుణ్యంతో ప్రపంచకప్ జట్టు స్థానాన్ని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్కు కోల్పోయిన యువ ఆటగాడు రిషబ్ పంత్, తాజాగా ప్రపంచకప్ జట్టుతో చేరనున్నాడు. ఐసీసీ టోర్నీల హీరో, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో బొటనవేలి గాయానికి గురైన సంగతి తెలిసిందే. బొటనవేలికి చిన్నపాటి చీలిక రావటంతో ధావన్కు వైద్యులు మూడు వారాల విశ్రాంతి సూచించారు. జూన్ 16న పాకిస్థాన్తో మ్యాచ్ తర్వాత భారత్ ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులకూ ధావన్ దూరమైనా ఇంగ్లాండ్తో పోరు నాటికి ఫిట్నెస్ సాధిస్తే చాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఒకవేళ ధావన్ గాయం వైద్యానికి స్పందించకుంటే, ఆశించిన పురోగతి కనిపించకపోతే.. తక్షణమే అందుబాటులో ఉండేందుకు యువ ఆటగాడు రిషబ్ పంత్ను స్టాండ్బైగా ఎంపిక చేశారు. జూన్ 15న మాంచెస్టర్లో భారత జట్టుతో రిషబ్ పంత్ చేరనున్నాడు.
పంతే ఎందుకు? : యువ విధ్వంసకారుడు రిషబ్ పంత్ ఓపెనర్గా మంచి రికార్డు సాధించాడు. లోయర్ ఆర్డర్లో ఫినీషర్గా ఐపీఎల్ కొత్త బాధ్యతలు నిర్వర్తించాడు. శిఖర్ ధావన్ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనర్గా రానున్నాడు. నం.4 పొజిషన్లో దినేశ్ కార్తీక్, విజరు శంకర్లలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. ధావన్ గాయంతో వరల్డ్కప్కు దూరమైతే రిషబ్ పంత్ నేరుగా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. కెఎల్ రాహుల్ కీలక నం.4కు తిరిగి వెళ్లనున్నాడు. ధావన్ ఓపెనర్ స్థానం రాహుల్కు వెళితే.. నాల్గో స్థానంలో ఆడాల్సిన అంబటి రాయుడుని ఎంపిక చేస్తే బాగుండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జట్టు అవసరాల కోసం మేనేజ్మెంట్ కోరిన వారినే సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంటుంది!. ధావన్ గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్పై బరిలోకి దిగితే భారత్ రెండు ప్రయోజనాలు. కీలక దశలో గబ్బర్ జట్టులోకి రావటం, యువ కెరటం రిషబ్ పంత్కు ప్రపంచకప్ జట్టుతో విలువైన సమయం గడిపే అవకాశం లభించటం. భారత క్రికెట్ ప్రియులూ ఇదే కోరుకుంటారని చెప్పనక్కర్లేదు.