Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం
- టాస్ పడకుండానే కీలక మ్యాచ్ రద్దు
- షెడ్యూల్పై అభిమానుల్లో తీవ్ర అసహనం
నాటింగ్హామ్ : ప్రపంచకప్లో మరో మ్యాచ్ వర్షార్పణం. అగ్రజట్లు భారత్, న్యూజిలాండ్ కీలక సమరం నాటింగ్హామ్లో వర్షం కారణంగా రద్దు అయ్యింది. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పలుమార్లు పిచ్ పరిశీలన, అవుట్ ఫీల్డ్ పర్యవేక్షణ అనంతరం అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ రద్దు అయ్యింది. భారత్, న్యూజిలాండ్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఐదు పాయింట్లతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
నేరుగా పాక్తో పోరు : భారత్, పాకిస్థాన్లు ఆస్ట్రేలియాపై మ్యాచ్ తర్వాత నేరుగా ముఖాముఖి తలపడనున్నాయి. ఆసీస్పై విజయం సాధించిన కోహ్లిసేన, గురువారం న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆడలేకపోయింది. మరోవైపు పాకిస్థాన్ సైతం ఆస్ట్రేలియాతో బుధవారం మ్యాచ్ ఆడేసింది, ఉత్కంఠ పోరులో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ లేకుండా న్యూజిలాండ్పై ప్రయోగం చేద్దామనుకున్న కోహ్లిసేనకు ఇది ప్రతికూలమే. తీవ్ర ఒత్తిడి నెలకొనే పాకిస్థాన్ మ్యాచ్లోనే భారత్ తుది జట్టులో మార్పులు, బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేసుకోవటం కాస్త కష్టమైన విషయమే!.