Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ : 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కుల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాఖలు చేసిన బిడ్కు బీసీసీఐ మద్దతు ఇచ్చిందని పీసీబీ చైర్మన్ ఈషన్ మణి వెల్లడించారు. ఇటీవల సింగపూర్లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశాల్లో ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకుంది. 2020 సెప్టెంబర్లో ఆసియాకప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఆ వెంటనే ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ' మా ఆతిథ్య బిడ్కు భారత్ మద్దతు ఇచ్చింది. వేదికపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పాకిస్థాన్లో నిర్వహించాలని మా తొలి ప్రాధాన్యం. బీసీసీఐకి భారత ప్రభుత్వం అనుమతి లభించకపోతే, యు.ఏ.ఈలో నిర్వహిస్తాం' అని మణి తెలిపాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా.. క్రికెట్ బోర్డుల సఖ్యత కొనసాగుతుంది. క్రికెట్ బోర్డుల నడుమ ఎటువంటి సమస్యలు లేవు. ద్వైపాక్షిక క్రికెట్పై మా పాలసీ సుస్పష్టం. మాతో ఆడాలని మరోసారి భారత్ను కోరబోము' అని మణి పేర్కొన్నాడు.