Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్లో పాక్పై భారత్ ఆధిపత్యం
- అభిమానుల్లో విపరీత అంచనాలు
నవతెలంగాణ క్రీడా విభాగం
17 సంవత్సరాలు. నాలుగు ప్రపంచకప్లు. ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచకప్లో దాయాది జట్లు భారత్, పాకిస్థాన్ పోరు లేనేలేదు. కానీ ముఖాముఖి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు భారత్, పాకిస్థాన్ భావోద్వేగాలు దాగలేదు. మైదానంలో ఆటగాళ్లు, బయట అభిమానులు ఆవేశాలను బయట పెడుతుంటారు. మరోసారి వరల్డ్కప్లో దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం మాంచెస్టర్లో భారత్, పాకిస్థాన్ పోటీపడుతున్నాయి.
క్రికెట్ ప్రపంచం కోరుకునే సమరం. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పోరు. కోట్లాది ప్రేక్షకులు కళ్లప్పగించి మ్యాచ్లో లీనమయ్యేది భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోటీలోనే. క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ అత్యధిక ఆదరణ కలిగిన పోటీలు ఉన్నాయి. కానీ పాకిస్థాన్, భారత్ అన్నింటిలో ప్రత్యేకం. క్రికెట్ ప్రపంచం కోరుకునే సమరమే ఇండోపాక్ క్రికెట్ పోరు. ద్వైపాక్షిక సంబంధాల కారణంగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాల్గొంటున్న భారత్, పాకిస్థాన్లు జూన్ 16న, మాంచెస్టర్లో తలపడనున్నాయి. వరల్డ్కప్లో భారత్, పాక్లు ఆరు సార్లు ఢకొీన్నాయి. ఆరు మ్యాచుల్లోనూ టీమ్ ఇండియా విజేతగా నిలువగా.. పాకిస్థాన్కు రిక్త హస్తమే మిగిలింది. ఓవరాల్ వన్డే రికార్డులో భారత్పై పాక్దే పైచేయి. కానీ ఐసీసీ టోర్నీల్లో భారత్ ప్రదర్శన ప్రత్యేకం. ఒత్తిడి ప్రధాన పాత్ర పోషించే దాయాదుల మ్యాచ్ను చూసేందుకు ఇష్టపడని వారుండరు అనటం అతశయోక్తి కాదు. ఐసీసీ ప్రపంచకప్ తొలినాళ్లలో భారత్, పాకిస్థాన్ మ్యాచులే లేవు. 1983 ప్రపంచకప్ విజేతగా భారత్ చరిత్ర సృష్టించింది అని అందరికి తెలుసు. కానీ అదే ప్రపంచకప్లో పాకిస్థాన్ సెమీఫైనల్స్కు చేరిన సంగతి కొందరికే తెలుసు. సెమీస్లో విండీస్ చేతిలో పాక్ ఓడింది. లేదంటే 1983లోనే దాయాదుల పోరు చూడాల్సి వచ్చేది. 1975, 1979 ప్రపంచకప్లలో భారత్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ కారణంగా పాకిస్థాన్తో మ్యాచ్ కుదర్లేదు. 1987లో న్యూజిలాండ్పై భారీ విజయంతో సెమీఫైనల్లో పాకిస్థాన్తో భారత్ ఢ వీలు పడలేదు. సొంతగడ్డపై సెమీస్లో రెండు జట్లూ ఓడటం వేరే సంగతి. ఈ సమయంలోనే ఐసీసీ, ప్రసారదారులు, ప్రకటనదారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రపంచకప్లలో తప్పనిసరిగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ ఉండాలని కోరుకున్నారు. 1992 సిడ్నీలో మొదలైన భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్ వైరం.. 1996, 1999, 2003లో కొనసాగింది. 2007లో భారత్, పాకిస్థాన్లు గ్రూప్ దశలోనే బంగ్లాదేశ్, ఐర్లాండ్ చేతిలో భంగపాటుతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 2011 సెమీఫైనల్లో, 2015 గ్రూప్ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ పోరు పున ప్రారంభమైంది. దాయాదుల క్రికెట్ సమరం తాజాగా మాంచెస్టర్కు చేరుకుంది. తాజా వేదికపై 1996 ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ ఓడించింది. ఇప్పుడూ ప్రతిష్టాత్మక భారత్, పాక్ పోరును అక్కడే నిర్వహిస్తున్నారు. చరిత్ర కొనసాగుతుందా? కొత్త చరిత్రకు నాంది పడుతుందా? క్రికెట్ సమరమే తేల్చాలి.
చిరకాల మెరుపులు
సచిన్ శివతాండవం : ప్రపంచకప్లో భారత్పై తొలిసారి తొలుత బ్యాటింగ్ చేసింది. అప్పటికే టోర్నీలో కంగారూపై మినహా అన్ని జట్లపై భారత్ నెగ్గింది. సయిద్ అన్వర్ సెంచరీతో పాకిస్థాన్ 273 పరుగులు చేసింది. వసీం అక్రమ్, వకార్ యూనీస్, షోయబ్ అక్తర్లతో కూడిన పేస్ త్రయంపై సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీ విరుచుకుపడింది. అక్తర్ వేసిన తొలి ఓవర్లోనే ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. సెహ్వాగ్ సైతం వకార్పై ఓ ఫోర్, సిక్సర్తో దూకుడు అందుకున్నాడు. 5 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది. వరుస బంతుల్లో సెహ్వాగ్, గంగూలీ వికెట్లతో కొత్త బ్యాట్స్మన్ మహ్మద్ కైఫ్ కాస్త సమయం తీసుకున్నాడు. వెనక్కి తగ్గని సచిన్ 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. రెండో స్పెల్కు వచ్చిన అక్తర్పై 12 బంతుల్లో 18 పరుగులు బాదాడు. సచిన్ దూకుడుతో 12 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు చేసింది. 98 పరుగుల వద్ద సచిన్ను అక్తర్ అవుట్ చేసి, ఎట్టకేలకు ఉపశమనం పొందాడు. అప్పటికి భారత్ స్కోరు 28 ఓవర్లలో 181. రాహుల్ ద్రవిడ్ (44 నాటౌట్)తో కలిసి యువరాజ్ అర్థ సెంచరీ బాదాడు. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది. సచిన్, సెహ్వాగ్ వీరోచిత ఓపెనింగ్కు ఈ మ్యాచ్ వేదికైంది. ప్రపంచకప్లో పాకిస్థాన్పై సచిన్ విధ్వంసమే ఇప్పటికీ అత్యుత్తమం.
ప్రసాద్ మ్యాడ్నెస్ : 1996 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్స్. వరల్డ్కప్ నాకౌట్లో భారత్, పాకిస్థాన్లు తలపడటం ఇదే తొలిసారి. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ ఆ మ్యాచ్లో నెగ్గితే.. సెమీస్, ఫైనల్స్ సొంతగడ్డపై ఆడే వెసులుబాటు. భారత్ కనీసం సెమీస్కు చేరినా చాలని అభిమానుల కోరిక. కెప్టెన్, స్టార్ సీమర్ వసీం అక్రమ్ ఫిట్నెస్ సమస్యలతో ఆ మ్యాచ్కు దూరమయ్యాడు. ఆమీర్ సోహైల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. టాస్ ఓడిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. నవజ్యోత్ సింగ్ సిద్దూ, సచిన్ టెండూల్కర్లు తొలి వికెట్కు 90 పరుగులు జోడించారు. సచిన్ నిష్క్రమించినా.. సిద్దూ 93 పరుగుల ఇన్నింగ్స్తో కదం తొక్కాడు. భారత్ 250 పరుగుల లోపే పరిమితయ్యేలా కనిపించింది. కానీ డెత్ ఓవర్లలో అజరు జడేజా వీరవిహారం చేశాడు. వకార్ యూనీస్ వేసిన చివరి రెండు ఓవర్లలో ఏకంగా 40 పరుగులు పిండుకున్నాడు. అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ సైతం సిక్సర్లతో చెలరేగారు. చివరి 4 ఓవర్లలో 57 పరుగులు చేసి భారత్ 287 స్కోరు సాధించింది. ఛేదనలో పాకిస్థాన్కు బలమైన ఆరంభం లభించింది. 10 ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. ప్రమాదకర సయిద్ అన్వర్ను శ్రీనాథ్ను అవుట్ చేసినా.. 113/1తో పాక్ ఛేదన వైపు సాగింది. ఈ సమయంలో వెంకటేశ్ ప్రసాద్పై ఓ ఫోర్ బాదిన అమీర్ సోహైల్ తర్వాతి బంతి గమ్యం బౌండరీనేనని సైగ చేశాడు. ఆ ఘటనతో ప్రేరణ పొందిన ప్రసాద్ తర్వాతి బంతికే సోహైల్ను పెవిలియన్కు సాగనంపాడు. అదే మ్యాడ్నెస్తో అహ్మద్, ఇంజమామ్ వికెట్లనూ కూల్చాడు. మిడిల్ ఆర్డర్ పతనంతో ఛేదన భారం సలీమ్ మాలిక్, జావెద్ మియాందాద్లపై పడింది. పాక్ను నిలువరించిన భారత్ అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపు ఘనత సీమర్ ప్రసాద్దే.
మొహాలీలో భల్లే భల్లే : భారత్, పాకిస్థాన్ మరోసారి ప్రపంచకప్ నాకౌట్లో తలపడ్డాయి. ఇప్పుడూ భారత్ సొంత అభిమానుల నడుమ ఆడింది. 2011 వరల్డ్కప్ సెమీఫైనల్లో టాస్ నెగ్గిన ధోని, మొహాలీలో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఉమర్ గుల్పై విజృంభించిన సెహ్వాగ్ అతడి రెండో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లతో దండెత్తాడు. 25 బంతుల్లో 38 పరుగులు చేసిన సెహ్వాగ్ వికెట్ నిలుపుకోలేదు. మరో ఎండ్లో జీవనదానాలు పొందిన సచిన్ విలువైన 85 పరుగులు సాధించాడు. చివర్లో ధోని (25), సురేశ్ రైనా (36) మెరుపులతో భారత్ 260 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్థాన్ 100/2తో మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ సింగ్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. యువరాజ్ సింగ్ వరుస ఓవర్లలో సయిద్ సఫీక్, యూనిస్ ఖాన్లను అవుట్ చేయగా.. హర్బజన్ సింగ్ వరుసగా ఉమర్ అక్మల్, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీలను సాగనంపాడు. మిస్బాఉల్ హాక్ ఆఖరు వరకూ పోరాడినా..అతడూ పెవిలియన్కు చేరక తప్పలేదు. 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.
దాయాదుల ఢ
రత్ 6 పాకిస్థాన్ 0
2015 ఆడిలైడ్ గ్రూప్ మ్యాచ్లో
76 పరుగులతో భారత్ ఘన విజయం.
2011 మొహాలీ ఉత్కంఠ సెమీఫైనల్లో భారత్ 29 పరుగులతో జయకేతనం ఎగురవేసింది.
2003 సెంచూరియన్ సూపర్ సిక్సర్ ఛేదనలో భారత్ 6 వికెట్లతో గెలుపొందింది.
1999 మాంచెస్టర్లో అజారుద్దీన్ సారథ్యంలో భారత్ 47 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
1996 బెంగళూర్లో జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య భారత్ 39 పరుగుల తేడాతో గెలిచింది.
1992 సిడ్నీ గ్రూప్ మ్యాచ్లో భారత్
43 పరుగుల తేడాతో గెలుపొందింది.