Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్పై ప్రశంసల జల్లు కురిసింది. వీరిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తదితరులు ఉన్నారు. భారత్కు వరల్డ్ చాంపియన్షిప్లో తొలి సిల్వర్ మెడల్ సాధించిన సైనా భారత బ్యాడ్మింటన్ను మరో మెట్టు పైకి ఎక్కించిందని బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శారు), మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సైనాకు అభినందనలు తెలిపారు. సైనా స్వర్ణ వేటలో ఓడినా.. యువత హృదయాల్ని గెల్చుకుందని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిసింది.