Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : పాట్నాలో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో పుణెరి పల్టాన్ 33-28 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పుణె ఈ విజయంతో ఢిల్లీ సెమీస్ అవకాశాలను పూర్తిగా తుడిచేసింది. మ్యాచ్లో పుణె ఆటగాడు జితేష్ జోషి 8, సంజరు కుమార్7 రైడ్ పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టులో కష్టింగ్ అడకె 9 రైడ్ పాయింట్లు సాధించినా మిగతా వారు విఫలమయ్యారు. మరో మ్యాచ్లో.. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి జోరుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్కు బెంగాల్ వారియర్స్ 39-38 తేడాతో షాకిచ్చింది. ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్లో అడుగుపెడతామనుకున్న పాంథర్స్కు వారియర్స్కు అడ్డుగోడగా నిలిచింది.