Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ : ప్రపంచకప్ ప్రసారదారు టెలివిజన్ కమర్షియల్ ప్రకటనలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. ' పీసీబీ తరఫున ఈషన్ మణి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. లేఖ రాసారా? ఫోన్లో నిరసన తెలిపారా? అనేది తెలియదు. కానీ అభ్యంతరం వ్యక్తం చేశారు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ 'మోక మోక' ప్రకటన కొనసాగింపులో.. పాకిస్థాన్ అభిమానికి భారత ఫ్యాన్ తండ్రిగా వ్యవహరిస్తాడు. భారత్, పాక్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని బంగ్లాదేశ్ అభిమాని అడగటంతో ప్రకటన మొదలైతుంది. ప్రకటన అభ్యంతరకరంగా ఉందని బీసీసీఐ సైతం భావించినా, ఐసీసీ వద్ద ప్రస్తావించలేదు. మరోవైపు విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు భారత టెలివిజన్ ఛానల్కు చెందిన రిపోర్టర్, కెమెరామెన్ అక్రిడిటేషన్ కార్డులను ఐసీసీ రద్దు చేసింది. ఇది ఐసీసీ ప్రసార నిబంధనలకు విరుద్ధం. భారత క్రికెటర్లతో సన్నిహితంగా మెలితే ఓ ఫ్రీలాన్స్ పాత్రికేయుడు సైతం ఫేస్బుక్లో ప్రసారం ఇచ్చాడు. ఐసీసీ అతడిని హెచ్చరికతో వదిలేసింది.