Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిడి చైనా సొంతం
- ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్స్
డెన్బాచ్ (నెదర్లాండ్స్) : 14 ఏండ్ల విరామం తర్వాత పసిడి పోరుకు చేరుకున్న భారత ఆర్చరీ రికర్వ్ మెన్స్ జట్టు, స్వర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు భారత ఆర్చర్లు పసిడి పతకం కోల్పోయారు. ఫైనల్లో 27-26తో భారత ఆర్చర్ల జట్టు ముందంజలో నిలిచింది. తరుణ్దీప్ రారు, అటాను దాస్, ప్రవీణ్ జాదవ్లు ఆధిక్యాన్ని నిలుపుకోలేదు. చైనా ఆర్చర్లు డింగ్ యీలింగ్, వీ , ఫెంగ్ హవోలు కచ్చితమైన గురితో మెరిశారు. 6-2తో ఫైనల్లో విజయాన్ని అందుకున్నారు. మహిళల రికర్వ్ జట్టు కాంస్యం సాధించగా, జ్యోతీ సురేఖ సైతం కాంస్యం సాధించింది. ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత్కు ఇది మూడో పతకం. ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత్కు ఇది ఆరో రజతం. ఇప్పటివరకూ భారత్ పసిడి సాధించలేదు. ' సంతోషం, బాధ రెండూ ఒకే సమయంలో కలుగుతున్నాయి. ప్రపంచ చాంపియన్షిప్స్లో ఎన్నో సిల్వర్స్ సాధించాం. కానీ ఎన్నడూ స్వర్ణం సాధించలేదు. ఈసారీ ఫైనల్లో పసిడి పతకం కొట్టలేకపోయాం' అని తరుణ్దీప్ రారు అన్నాడు.