Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాంచెస్టర్: భారత్కు మరో ఎదురుదెబ్బ. సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ ఎడమ కాలి తొడ కండరం గాయానికి గురయ్యాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో 2.4 ఓవర్లు వేసిన భువనేశ్వర్, తొడ కండరం పట్టేయటంతో మైదానం వీడాడు. భువి స్థానంలో 12వ ఆటగాడు రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. గాయం తీవ్రతపై బీసీసీఐ వివరాలు చెప్పలేదు. జూన్ 22న అఫ్గనిస్థాన్ మ్యాచ్కు భువి స్థానంలో మహ్మద్ షమి ఆడే అవకాశం ఉంది. వెస్టిండీస్ లేదా ఇంగ్లాండ్ మ్యాచ్కు భువి అందుబాటులోకి రానున్నాడు!. ఇప్పటికే శిఖర్ ధావన్ ఎడమ చేతి బొటనవేలికి చీలికతో కనీసం రెండు వారాలు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.