Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్
లండన్ : బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ముగించుకుని, నేరుగా ప్రపంచకప్లో ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను ఇంగ్లాండ్ అభిమానులు ఎక్కడికెళ్లినా గేలి చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ స్మిత్ పట్ల అభిమానులు ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు. భారత్తో మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులను సముదాయించాడు. దూషించవద్దు, ప్రోత్సహించండి అంటూ సైగలు చేశాడు. అప్పటి వరకూ 'మోసగాడు మోసగాడు' అంటూ అరిచిన భారత అభిమానులు చప్పట్లతో ముందుకొచ్చారు. అభిమానుల తరఫున కోహ్లి అప్పుడే స్మిత్కు క్షమాపణలు సైతం చెప్పాడు. కోహ్లితో కరచాలనం చేసిన స్మిత్, భుజం తట్టాడు. ' అభిమానులు చేస్తున్నదానిలో నిజాయితీ ఉంది. వాటిని నేను పట్టించుకోవటం లేదు. కానీ విరాట్ కోహ్లి చూసిన సంకేతం గొప్పది' అని స్మిత్ మీడియాతో అన్నాడు. స్మిత్, కోహ్లిలు గతంలో బెంగళూర్ టెస్టులో తీవ్ర వివాదంలో మునిగారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సైతం వివాదంలోకి దూకాయి. ప్రపంచకప్లో స్మిత్ను అభిమాలను గేలి చేయటం నచ్చలేదని, అందుకే భారత అభిమానుల తరఫున క్షమాపణలు కోరానని కోహ్లి తెలిపాడు.