Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటనల రూపంలో దండిగా డబ్బు
- స్టేడియంలో అభిమానుల మైత్రీ మెరుపు
నవతెలంగాణ క్రీడా విభాగం
క్రికెట్ ప్రపంచకప్ మొదలైంది. 17 సంవత్సరాల్లో నాలుగు ప్రపంచకప్లు ముగిశాయి. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ఒక్కసారి కూడా ముఖాముఖి తలపడలేదు. రెండు దేశాల సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రికత్త, అదే సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల తెగతెంపులు ఐసీసీని ఆదాయ ఆలోచనలో పడేసింది. అప్పట్నుంచి, వరుసగా భారత్, పాకిస్థాన్లు క్రమం తప్పకుండా ప్రపంచకప్లో పోటీపడుతున్నాయి. 2007లో భారత్, పాక్లు వరుసగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ చేతిలో భంగపడి గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఆ ఒక్కసారీ మినహాయిస్తే 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్లు ఢకొీట్టాయి.
ఫుట్బాల్లో అర్జెంటీనా, బ్రెజిల్ తలపడే ఎట్టా ఉంటుంది? యూరోప్లో జర్మనీతో ఇంగ్లాండ్.. ఫ్రాన్స్తో జర్మనీ పోటీపడితే ఎలా ఉంటుంది? సాకర్ అభిమానులకు ఆ సమరాలు రసకందాయం. అంతకుమించి మార్కెట్, అభిమానుల అటెన్షన్ అనుభవిస్తున్న పోరు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్. సంప్రదాయ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మ్యాచులను భారత్, పాకిస్థాన్ సమరం ఎప్పుడో దాటేసింది. ప్రపంచ క్రీడల్లో ఇప్పుడు భారత్, పాకిస్థాన్ సమరమే అత్యంత పాపులర్.
భారత్, పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్కు వచ్చిన ఆదరణ చాలా సందర్భాల్లో ప్రపంచకప్ ఫైనల్స్కు కూడా రాలేదు. తాజాగా మాంచెస్టర్లోనూ అదే జరిగింది. వంద కోట్ల మందికి పైగా దాయాదుల సమరాన్ని వీక్షించారు. వందల కోట్ల బిజినెస్ ఈ మ్యాచ్తో జరిగింది. కార్పోరేట్, మార్కెట్ వర్గాలు ఎప్పట్లాగే ఈసారీ విపరీత హైప్ తీసుకొచ్చారు. కానీ చరిత్ర పునరావృతం అయ్యింది. మ్యాచ్కు ముందు కనిపించిన ఉద్రిక్తత, మ్యాచ్లో కనిపించలేదు. ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వరుసగా ఏడోసారి ఏకపక్షమైంది. 1992, 1996, 1999, 2011, 2015లో ఛేదనలో పాకిస్థాన్ ఛేదనలో చతికిల పడింది. 2019లోనూ పాక్ ఛేదనలో తేలిపోయింది. భారత్, పాకిస్థాన్ రెగ్యులర్ వన్డేల్లో అభిమానులు ఆస్వాదించిన ఉద్రిక్తత, ఉత్కంఠ జాడ లేకుండానే మాంచెస్టర్లో మరో ప్రపంచకప్ మ్యాచ్ ముగిసింది.
మ్యాచ్ ఫలితం ఎలాగున్నా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో ప్రసారదారులు దండిగా డబ్బులు సంపాదించారు. ప్రపంచకప్లో భారత మ్యాచులకు పది సెకండ్ల నిడివి గల ప్రకటనకు రూ. 10-12.5 లక్షలు డిమాండ్ నడుస్తోంది. కానీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్టార్స్పోర్ట్స్ ఇండియా పది సెకండ్ల వీడియో ప్రకటనకు రూ. 35 లక్షలు వసూలు చేసింది. వంద కోట్ల ప్రేక్షకులు టెలివిజన్లో చూస్తున్న మ్యాచ్ కావటం, అందరికీ చేరువయ్యే మార్గమని భావించి ధర ఎక్కువున్నా డిమాండ్ తగ్గటం లేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఎప్పుడో ప్రకటనల బుకింగ్స్ చేసిన స్టార్స్పోర్ట్స్.. ఆఖరు విడతగా 3 శాతం బుకింగ్స్ను తీసుకుంది. వీటి ధర మరింత ఎక్కువని ప్రసారదారు వర్గాలు చెబుతున్నాయి.
టెలివిజన్ మీడియా భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై రేకెత్తించిన ఉద్రిక్తతను మైదానంలో అభిమానులు పట్టించుకోలేదు. టీమ్ ఇండియా అభిమానులతో నిండిపోయిన మాంచెస్టర్లో స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. మైదానంలో అభిమానులు ఎంతో మైత్రీతో మెలిగారు. భారత్, పాకిస్థాన్ వీరాభిమానులు ఒకే వరుసలో కూర్చున్నారు. మ్యాచ్కు ముందు సైతం ఇరు జట్ల అభిమానులు సందడి చేశారు. పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకున్నారు. భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచుల్లో ఇదో మంచి విషయం. టెలివిజన్ ప్రసారాల్లో అభిమానుల సఖ్యత సానుకూల దకృథం కలిగించింది. మైదానంలో ఆటగాళ్లు సైతం భావోద్వేగాలను నియంత్రించుకున్నారు. గతంలో చూసినట్టు, నువ్వా నేనా అనే ఉద్రిక్త సంఘటనలకు మాంచెస్టర్లో చోటు దక్కలేదు. భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్లో చరిత్ర పునరావృతం అయ్యింది. వరుసగా ఏడోసారి భారత్ విజయఢంకా మోగించింది. బిజినెస్లో కొత్త పుంతలు తొక్కిన మాంచెస్టర్ కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద మెగా సందడి చేసింది.