Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ చేతిలో పాక్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణిం చుకోలేకపోతు న్నారు. ఓటమి అనంతరం పాక్ ప్రదర్శనపై, ఆ జట్టు కెప్టెన్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత్తో ఓడిపోయినందుకు గానూ పాక్ జట్టును నిషేధించాలంటూ ఓ అభిమాని ఏకంగా కోర్టు మెట్లెక్కాడు. ఓటమికి జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలంటూ పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రన్వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పాక్ జట్టును, ఇంజమామ్ ఉల్ హక్ అధ్యక్షతన ఉన్న సెలక్షన్ కమిటీపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారించి.. దీనిపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆదేశాలు కూడా జారీ చేయడం విశేషం.