Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ కప్లో ఆస్ట్రేలియా మ్యాచ్లో ధావన్కు గాయమైన సంగతి తెలిసిందే. తొలుత ఈ గాయం కారణంగా ధావన్కు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే తాజాగా స్కానింగ్ చేయగా గాయం ఏ మాత్రం తగ్గకపోవడంతో అతడు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ధావన్ను ప్రపంచకప్ నుంచి అతడి తప్పిస్తున్నట్లు బిసిసిఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని టీమ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో వెల్లడించారు.. 'గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి ధావన్ నిష్క్రమించాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము' అంటూ పేర్కొన్నాడు. అతడి స్థానంలో రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకోనున్నారు.
ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శిఖర్ ధావన్ వేలికి గాయమైనంది. కమిన్స్ విసిరిన బౌన్సర్ను ఆడే క్రమంలో బంతి నేరుగా అతని వేళ్లను తాకింది. దీనితో వేలు చిట్లింది. గాయం అయినప్పటికీ శిఖర్ ధావన్ నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. దీంతో సెమీస్ వరకు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. అలాగే బీసీసీఐకి కూడా ధావన్ను తప్పించడం మొదట్నుంచి ఇష్టం లేదు. దీంతో ధావన్ను తప్పించకుండా పంత్ను బ్యాకప్గా ఇంగ్లండ్కు పంపించింది. అయితే గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో బిసిసిఐ తాజా నిర్ణయం తీసుకుంది.