Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా యార్కర్ దెబ్బ
సౌతాంప్టన్: ప్రపంచకప్లో మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న కోహ్లిసేనను, గాయాలు బెంబేలెత్తిస్తున్నాయి. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇదివరకే బొటనవేలి చీలికతో ప్రపంచకప్కు దూరమయ్యాడు. తొండ కండరాల గాయంతో భువనేశ్వర్ కుమార్ కనీసం మూడు మ్యాచుల్లో ఆడలేని పరిస్థితి. ఈ జాబితాలోకి తాజాగా విజరు శంకర్ చేరాడు. అఫ్గనిస్థాన్తో మ్యాచ్ ముందు భారత జట్టు ప్రాక్టీస్ను గురువారం మొదలెట్టింది. నెట్స్లో బుమ్రా వేసిన యార్కర్ విజరు శంకర్ కాలి బొటనవేలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడిన శంకర్ ప్రాక్టీస్ సెషన్ను వీడాల్సి వచ్చింది. సాయంత్రానికి విజరు శంకర్ సాధారణ స్థితికి చేరుకున్నట్టు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. అతడి విషయంలో ఆందోళన అక్కర్లేదని, అఫ్గాన్ మ్యాచ్కు ఫిట్నెస్ సాధిస్తాడని పేర్కొన్నది. శిఖర్ ధావన్ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడుతుండగా.. నం.4 బ్యాట్స్మన్గా విజరు శంకర్ పాకిస్థాన్పై ప్రపంచకప్ అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ' బ్యాట్స్మన్ గాయపడాలని ఏ బౌలర్ బంతులు వేయడు. అయినా, నెట్స్లో బ్యాట్స్మెన్ షాట్లు ఆడవద్దని ఎప్పుడైనా చెప్పారా? వాళ్లు షాట్లు కొడుతూనే ఉన్నారు. దురదృష్టశావత్తు విజరు శంకర్కు గాయమైంది' అని జశ్ప్రీత్ బుమ్రా మీడియాతో అన్నాడు.
పిచ్ నిన్ను మిస్ అవుతోంది! : ఎడమచేతి బొటన వేలికి చీలిక వచ్చినా నొప్పితో బ్యాటింగ్ కొనసాగించిన శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. గాయపడిన వారం తర్వాత ధావన్ అనుకున్న సమయంలోగా కోలుకునే పరిస్థితి లేదని వైద్య బృందం తేల్చి చెప్పింది. ఐసీసీ టోర్నీల్లో అమోఘమైన రికార్డున్ను ధావన్ సేవలను టీమ్ ఇండియా కోల్పోయింది. అతడి స్థానంలో మరో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రపంచకప్లో ఆడలేకపోతున్నానని బుధవారం శిఖర్ ధావన్ ట్వీట్టర్లో సందేశం ఇచ్చాడు. ధావన్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు ఉంచారు. భారత ప్రధాని నరెంద్ర మోడీ సైతం ధావన్కు ఊరట సందేశం ఇచ్చాడు. ' పిచ్ నిన్ను మిస్ అవుతుందనటంలో సందేహం లేదు. త్వరగా కోలుకొని క్రికెట్ పిచ్పై భారత్కు మరిన్ని విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నాను' అని మోడీ ట్వీట్ చేశారు.