Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్పై అదిరే విజయం
- మలింగ, డిసిల్వ మెరుపులు
- బెన్ స్టోక్స్ పోరాటం వృథా
లీడ్స్ (ఇంగ్లాండ్) : ప్రపంచకప్ ఫేవరెట్ ఇంగ్లాండ్కు మరో షాక్. వరుస విజయాలతో దూకుడుమీదున్న ఆతిథ్య జట్టుకు శ్రీలంక దిమ్మదిరిగే షాకిచ్చింది. 233 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ను 212 పరుగులకే కుప్పకూల్చింది. 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లసిత్ మలింగ (4/43), ధనంజయ డిసిల్వ (3/32), ఇసురు ఉదాన (2/41) వికెట్ల వేటలో చెలరేగారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (82 నాటౌట్, 89 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ పోరాటం వృథా అయ్యింది. జానీ బెయిర్స్టో (0), జేమ్స్ విన్సె (14), జో రూట్ (57), జోశ్ బట్లర్ (10)లను అవుట్ చేసిన మలింగ ఇంగ్లాండ్ దూకుడు కోరలు పీకేశాడు. ఇయాన్ మోర్గాన్ (21), మోయిన్ అలీ (16), క్రిస్ వోక్స్ (2), ఆదిల్ రషీద్ (1), జోఫ్రా ఆర్చర్ (3) విఫలమయ్యారు. ఆఖర్లో స్టోక్స్ వేగం పెంచి ఇంగ్లాండ్ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ మరో ఎండ్లో మార్క్వుడ్ (0)ను అవుట్ చేసిన ప్రదీప్ శ్రీలంకకు టోర్నీలో రెండో విజయాన్ని అందించాడు. అఫ్గాన్పైనా శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 232/9 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నె (1), కుశాల్ పెరీరా (2) విఫలమయ్యారు. ఫెర్నాండో (49), మెండిస్ (46), మాథ్యూస్ (85) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ (3/52), మార్క్వుడ్ (3/40), ఆదిల్ రషీద్ (2/45) రాణించారు. 233 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 30 ఓవర్లలోనే ఛేదిస్తుందనే అంచనాలు తలకిందులైంది. పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్కు టోర్నీలో ఇది రెండో ఓటమి.