Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో విండీస్ పర్యటన
ముంబయి : ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ మరింత విశ్రాంతి ఇవ్వనుంది. వరుస విజయాలతో కోహ్లిసేన 2019 ప్రపంచకప్లో సెమీఫైనల్స్ బెర్త్ లాంఛనం చేసుకుంది. ప్రపంచకప్ ఫైనల్స్కు టీమ్ ఇండియా చేరుకుంటే జులై 14 వరకూ కోహ్లిసేన బిజీ షెడ్యూల్తో గడపనుంది. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్లో భారత జట్టు పర్యటించనుంది. మూడు టీ20, మూడు వన్డేలు సహా రెండు టెస్టులు ఆడనుంది. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జశ్ప్రీత్ బుమ్రాలకు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు విశ్రాంతి లభించనుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే మరికొంత మంది ఆటగాళ్లకూ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్లో భాగంగా తొలుత వెస్టిండీస్తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. విరాట్ కోహ్లి, జశ్ప్రీత్ బుమ్రా టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండనున్నారు. ఆగస్టుత 22 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత విండీస్ పర్యటనకు సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్షన్ కమిటీకి బహుశా ఇదే చివరి ఎంపిక సమావేశం అయ్యే అవకాశం ఉంది!.