Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంగ్లాండ్తో మ్యాచ్కు కోహ్లిసేన కొత్త జెర్సీలను ధరించనుంది. ఇంగ్లాండ్, భారత్ జెర్సీలు బ్లూ రంగులో ఉన్నాయి. ఆతిథ్య జట్టుగా ఇంగ్లాండ్కు అదే రంగు జెర్సీ ధరించే అవకాశం లభించింది. దీంతో భారత్ మరో రంగులో జెర్సీ వెతుక్కోక తప్పలేదు. ఆరెంజ్ రంగుతో కూడిన కొత్త జెర్సీను బీసీసీఐ శుక్రవారం ట్వీటర్లో ఉంచింది. తొలిసారి భారత్ ఆరెంజ్ జెర్సీలతో ఆడనుంది. బర్మింగ్హామ్లో కోహ్లిసేనను మెన్ ఇన్ బ్లూ అని కాకుండా, మెన్ ఇన్ ఆరెంజ్ అని పిలవాలేమో!.
టీమ్ ఇండియా జెర్సీలు మారటం ఇది కొత్త కాదు. కానీ మార్పు బ్లూ రంగులోనే ఉండేది. తొలిసారి ఆరెంజ్ రంగులోకి మారటం ఇప్పుడే. శ్రీలంక మాదిరి బ్లూ రంగులోనే మార్పులు చేయకుండా ఏకంగా ఆరెంజ్లోకి మారటానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉండటమే కారణమని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. కాషాయీకరణ క్రికెట్కు చేరిందని విమర్శిస్తున్నారు.