Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2022 కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ను తొలగిం చటం పట్ల భారత క్రీడా వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. కానీ ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ గగన్ నారంగ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ను తొలగించటం భారత్కు ఎదురు దెబ్బ కాబోదని అభిప్రాయపడ్డాడు. 'దీన్ని ఎదురు దెబ్బగా చూడలేను. ప్రతికూల దృక్ప థంతో చూడొద్దు. క్రికెట్ను తీస ుకుంటే, అదేమీ ఒలింపిక్స్లో లేదు. కనీసం కామన్వెల్త్ క్రీడల్లోనూ లేదు. అయినా, క్రికెట్ సొంతంగా ఎదిగింది. స్క్వాష్ విషయంలోనూ ఇదే జరిగింది. దీన్ని సానుకూలంగానే తీసుకుని, 2020 టోక్యో ఒలింపిక్స్పై దృష్టి సారించాలి' అని గగన్ నారంగ్ పేర్కొన్నాడు.