Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు భారత్తో కీలక పోరు
- సెమీస్ బెర్త్పై కోహ్లిసేన గురి
తొలి మ్యాచ్లోనే దక్షిణాఫ్రికాను మట్టి కరిపించింది. ప్రమాదకర వెస్టిండీస్పైనా అలవోక విజయం సాధించింది. ప్రపంచకప్ గ్రూప్ దశ ముగింపుకొచ్చినా టాప్-4 రేసులో ముందంజలోనే ఉంది. ఓడిన మ్యాచుల్లోనూ ఆకట్టుకున్న జట్టు ఏదైనా ఆ ఘనత బంగ్లాదేశ్కు దక్కుతుంది!.
సెమీస్ రేసులో చివరి రెండు మ్యాచులు నెగ్గితేనే బంగ్లాదేశ్ సెమీస్కు చేరుకోగల అవకాశం ఉంది. ఆ దిశగా నేడు బలమైన భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడి అజేయ రికార్డు కోల్పోయిన కోహ్లిసేన నేడు ఘన విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తుంది. బంగ్లాదేశ్, భారత్ పోరు నేడు.
బర్మింగ్హామ్
కొత్త ఫార్మాట్. గ్రూప్ దశలో తొమ్మిది జట్లతో తలపడాలి. టాప్-4 రేసులో అగ్ర జట్లు ఉండగా..బంగ్లాదేశ్ అవకాశాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదు. కానీ బంగ్లాదేశ్ ప్రదర్శన విమర్శల ప్రశంసలు అందుకుంది. స్ఫూర్తిదాయక విజయాలు సాధించి మెరుగైన స్థితిలో నిలబడింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. పొరుగు దేశాలు భారత్, పాకిస్థాన్లపై వరుస మ్యాచుల్లో నెగ్గి తీరాలి. నేడు బర్మింగ్హామ్లో భారత్తో బంగ్లాదేశ్ ఢకొీట్టనుంది. టోర్నీలో ఇతర జట్ల బలహీనతలను సొమ్ముచేసుకున్న బంగ్లాదేశ్, నేడు కోహ్లిసేన మిడిల్ ఆర్డర్ లోపం పైనా దెబ్బకొడుతుందేమో చూడాలి.
స్పిన్నర్లు పుంజుకుంటారా? : 2015 ప్రపంచకప్ తర్వాత భారత్ వన్డే విజయాల్లో మణికట్టు స్పిన్నర్ల పాత్ర కీలకం. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ కండ్లుచెదిరే ప్రదర్శన చేశారు. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్పై చాహల్, కుల్దీప్ దారుణంగా విఫలమయ్యారు. 20 ఓవర్లలో ఈ జోడీ 160 పరుగులు సమర్పించుకుంది. ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధనకు స్పిన్నర్లపై ఎదురుదాడిని ఎంచుకుంది. ఫ్లాట్ పిచ్ నేపథ్యంలో నేడు భారత్ ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దించే ఆలోచన విరమించుకునే వీలుంది. ఫిట్నెస్ సాధించిన భువనేశ్వర్ కుమార్ మూడో సీమర్గా తుది జట్టులోకి రానున్నాడు. లోయర్ ఆర్డర్లో భువనేశ్వర్ కుమార్ బ్యాట్తో ఉపయుక్తమైన బ్యాట్స్మన్. అవసరమైతే కేదార్ జాదవ్ పార్ట్ టైమ్ స్పిన్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. డెత్ ఓవర్లలో షమి పరుగులు ఎక్కువగా ఇచ్చినా, ఐదు వికెట్ల ప్రదర్శన అతడిని తప్పించేందుకు కోహ్లి ఇష్టపడకపోవచ్చు. జశ్ప్రీత్ బుమ్రా మరోసారి బంతితో నాయకత్వం వహించనున్నాడు.
రిషబ్ పంత్ చేరికతో బ్యాటింగ్ లైనప్కు వైవిధ్యం వచ్చింది. కెఎల్ రాహుల్ను తిరిగి మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే, రోహిత్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ తోడుతో, రోహిత్ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. విరాట్ కోహ్లి వరుస అర్ద సెంచరీలతో ఊపుమీదున్నాడు. నేడు బ్యాట్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కీలకం కానున్నారు. లోయర్ ఆర్డర్లో ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్ విధ్వంసక సామర్థ్యంపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. బంగ్లాపై ఈ ఇద్దరూ విజృంభిస్తారేమో చూడాలి.
బంగ్లాకు ఆ ఇద్దరు కీలకం : ప్రపంచకప్లో బంగ్లాదేశ్ స్ఫూర్తిదాయక విజయాల వెనుక ఇద్దరున్నారు!. స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్, స్టార్ బ్యాట్స్మన్ ముష్ఫీకర్ రహీమ్. ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో ముష్ఫీకర్, షకిబ్ గొప్పగా ఆడుతున్నారు. వీరికి లిటన్ దాస్, మహ్మదుల్లా సహకారం లభిస్తోంది. భారత్తో మ్యాచ్కు భావోద్వేగాలతో సిద్దమయ్యే బంగ్లాదేశ్, బర్మింగ్హామ్లో 2007 ప్రపంచకప్ ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ మష్రఫె మొర్తాజా నాయకత్వం ఆకట్టుకుంటుంది. కానీ పేసర్గా మొర్తాజా విఫలమయ్యాడు. ఆరు మ్యాచుల్లో అతడు ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. సగటు 279. ఎకానమీ విషయంలోనూ మెరుగ్గా లేడు. నేడు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో మొర్తాజా ముందుండి నడిపిస్తాడేమో చూడాలి. మొసద్దెక్ హుస్సేన్, ముస్తాఫిజుర్ పేస్ పదునెక్కుతుంది. స్పిన్నర్ మెహిది హసన్ ఏ పిచ్పైనా ప్రమాదకరం. ఎన్నో రెట్లు మెరుగైన బంగ్లాదేశ్.. భారత్పై విజయం సాధించాలని ఎదురుచూ స్తోంది. అందుకు కోహ్లిసేన సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.
పిచ్ రిపోర్టు : భారత్ వరుసగా రెండో మ్యాచ్ను ఒకే పిచ్పై ఆడనుంది. ఆదివారం ఇంగ్లాండ్తో ఆడిన పిచ్నే నేడు బంగ్లా మ్యాచ్కూ సిద్ధం చేశారు. ఇది ఫ్లాట్గా ఉంది. కానీ ఇన్నింగ్స్ సాగుతున్న కొద్ది మరీ నెమ్మదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు పిచ్ నుంచి అధిక ప్రయోజనం లభించనుంది. పిచ్ చతురస్రాకరంలో ఉండటంతో ఓ వైపు బౌండరీ మరీ తక్కువగా ఉంది. దీనిపై కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ మ్యాచ్ ఆడిన అనుభవంతో దీన్ని కోహ్లిసేన మరింత మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది!.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిటన్ దాస్, మహ్మదుల్లా, మొసద్దెక్ హుస్సేన్, మెహిదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, మష్రఫె మొర్తాజా, ముస్తాఫిజుర్ రెహమాన్.