Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమ్ ఇండియాలో జోష్ నింపటానికే..
లీడ్స్: ఆ రెండు మినహా అన్ని మ్యాచుల్లో దూకుడుగా ఆడుతున్న భారత్ శ్రీలంకతో తలపడనున్నది. లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్నది. టీమ్ ఇండియా ఆడిన 8 మ్యాచుల్లో ఆరింటిలో విజయాన్ని నమోదు చేసుకున్నది. పాయింట్ల పట్టికలో 13 పాయింట్లు దక్కయి. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్నది. బంగ్లాదేశ్ను 28 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ఇప్పటికే సెమీఫైనల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది. లీడ్స్లో శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పాల్గొనటానికి వెళ్తున్న భారత్ కెప్టెన్ కోహ్లితో పాటు సతీమణి,బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా తోడుగా వెళ్లింది. అనుష్క శర్మ టీమ్ ఇండియాతో పాటు తన భర్త కోహ్లికి చీయర్ చేస్తూ స్టేడియంలో కనిపించనున్న ది. ఇంతకు ముందు కూడా ఇంగ్లాండ్ వీధుల్లో కోహ్లి, అనుష్క ఉన్న ఫోటోలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత పాక్తో భారత్ మ్యాచ్ ఆడాక..వారిద్దరి ఫోటోలు కోహ్లి ఫ్యాన్ క్లబ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ అయ్యాయి.