Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీకి బీసీసీఐ వినతి
దుబాయ్ : ప్రపంచకప్లో ఆటగాళ్ల వ్యక్తిగత, రాజకీయ, సైనిక సందేశాలు ప్రచారం చేయటంపై నిషేధం విధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ఇటీవల వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. భారత్, శ్రీలంక మ్యాచ్ సందర్భంగా లీడ్స్ మైదానం మీదుగా విమానాలు రాజకీయ సందేశాలు ఇవ్వటం వివాదం రేపుతోంది. ' సేవ్ కాశ్మీర్', ' మూక దాడుల నుంచి కాపాడండి' అంటూ విమానాలు ఫ్లకార్డులు ప్రదర్శించాయి. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ' బలూచిస్థాన్కు న్యాయం చేయండి', ' పాకిస్థాన్లో అదృశ్యమైపోతున్న వారి జాడ ఎక్కడ' అనే ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మైదానంలోనే పాక్, అఫ్గాన్ అభిమానులు గొడవకు దిగిన సంగతి తెలిసిందే. లీడ్స్ అనుభవం నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి ఓ వినతి చేసింది. మాంచెస్టర్ సెమీఫైనల్స్ సందర్భంగా గగనతలంలో ఇటువంటి సందేశాలు ప్రదర్శించకుండా చూడాలని కోరింది.