Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాంచెస్టర్ :గ్రూప్ దశలో పోటీపడకుండానే సెమీస్ ముఖాముఖికి సిద్దమయ్యాయి భారత్, న్యూజిలాండ్. ఎడతెరపి లేని వర్షం కారణంగా గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు అయ్యింది. నేడు మాంచెస్టర్ సెమీఫైనల్స్కు సైతం వరుణుడు అడ్డుగా ఉన్నాడు. ఇక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షంతో నేడు ఆట వీలు కాకపోయినా, ఆందోళన అక్కర్లేదు. రిజర్వ్ డే ఉండటంతో బుధవారం సెమీఫైనల్స్ను నిర్వ హిస్తారు. బుధవారం సైతం వాతావరణం సహ కరించకపోతే, గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అనగా, భారత్ ఫైనల్స్కు చేరుతుంది.