Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడేజా, ధోని 116 భాగస్వామ్యం టీమ్ ఇండియాను టైటిల్ పోరుకు చేర్చిందనే భావన అందరిలోనూ కలిగింది. ఈ దశలో న్యూజిలాండ్ ఫీల్డింగ్లో చేసిన మెరుపు ప్రదర్శన మ్యాచ్ను మలుపు తిప్పింది. ఇన్నింగ్స్ 48.3 ఓవర్లో ధోని రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. స్క్వేర్లో బంతి అందుకున్న మార్టిన్ గప్టిల్ వికెట్ కీపర్ ఎండ్లో డైరెక్ట్ త్రో విసిరాడు. మరో 24 పరుగులు చేయాల్సిన దశలో ధోని వికెట్ కోల్పోయిన భారత్, ఫైనల్స్ ఆశలను ఆవిరి చేసుకుంది.