Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్ పర్యటనకు శాస్త్రి బృందం
ముంబయి : వరుసగా రెండోసారి భారత జట్టు ప్రపంచకప్ వేట సెమీఫైనల్లోనే ముగిసింది. 2014లో రవిశాస్త్రి టీమ్ డైరెక్టర్గా ఉండగా, 2019లో అతడే చీఫ్ కోచ్. సూపర్ ఆటగాళ్లతో ప్రపంచకప్ ఖాయం అనుకున్న దశలో సెమీఫైనల్లో అండర్డాగ్ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. దీంతో చీఫ్ కోచ్ రవిశాస్త్రి భవిష్యత్ ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా ఇతర సహాయ కోచ్లకు బీసీసీఐ 45 రోజుల పొడగింపు అందించింది. ఆగస్టు 1 నుంచి వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో శాస్త్రి అండ్ కోను కొనసాగించనుంది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ రాకతో ఈ రెండు విభాగాల్లో భారత్ గొప్పగా పుంజుకుంది. కానీ బ్యాటింగ్ కోచ్గా సంజరు బంగర్ నం.4 ఆటగాడిని తయారు చేయటంలో విఫలమయ్యాడు. బీసీసీఐ కోచ్ కోసం కొత్త దరఖాస్తులు ఆహ్వానించినా, శాస్త్రినే కొనసాగించినా బంగర్పై వేటు పడే అవకాశం ఎక్కువుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.