Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 18న భారత జట్ల ఎంపిక
ముంబయి : 2019 ప్రపంచకప్ ఓటమి చేదు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడే ప్రయత్నం చేస్తోంది టీమ్ ఇండియా. సెమీఫైనల్లో ఓడిన కోహ్లిసేన.. స్వదేశానికి నేడు రానుంది. పది రోజుల విరామం తర్వాత టీమ్ ఇండియా తొలి షెడ్యూల్ ఆరంభం కానుంది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనుంది. కొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, జశ్ప్రీత్ బుమ్రా సహా ఎం.ఎస్ ధోనిలకు విశ్రాంతి లభించే అవకాశం కనిపిస్తోంది. వీడ్కోలుపై ధోని తన నిర్ణయాన్ని ఇంకా తెలియజేయలేదు. వన్డే, టీ20లకు కోహ్లి, బుమ్రా, హార్దిక్లకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ క్రికెట్ ఆడనుంది. జులై 18న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న సీనియర్ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లను ఖరారు చేయనుంది. టెస్టు, వన్డే, టీ20 జట్లను ఎమ్మెస్కే బృందం ఎంపిక చేయనుంది. ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న తర్వాత విరామం ఎవరికి ఇవ్వాలనే విషయంపై స్పష్టత రానుంది.