Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లార్డ్స్ (లండన్)
2019 ప్రపంచకప్ ఫైనల్స్ 15 నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైంది. ఉదయం చిరుజల్లులతో లార్డ్స్లో అవుట్ ఫీల్డ్ కాస్త తడిగా కనిపించింది. పిచ్ను తనిఖి చేసిన అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్లు టాస్ను 15 నిమిషాలు వాయిదా వేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు టాస్ వేయాలి. 3 గంటలకు తొలి బంతి పడుతుంది. 2.45 గంటలకు టాస్ వేయగా, 3.15 గంటలకు మ్యాచ్ మొదలైంది. పిచ్పై తేమ పేసర్లకు అనుకూలమని తెలిసినా, ఛేదనలో ఒత్తిడి నేపథ్యంలో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.