Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవర్ రేట్పై ఐసీసీ నిర్ణయం
దుబాయ్ : తలకు గాయమైనప్పుడు సబ్స్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్లోనే కాదు బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్కు ముంగిట కెప్టెన్లకు గొప్ప ఊరట అందించింది. ఓ ఏడాది సమయంలో రెండు సందర్భాల్లో స్లో ఓవర్ రేట్తో వెనుకంజ వేస్తే, జట్టు నాయకుడిపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. తాజాగా ఈ నిబంధనను ఐసీసీ మార్చివేసింది. ' స్లో ఓవర్ రేట్కు కెప్టెన్ను మాత్రమే బాధ్యుడిని చేయటం సమంజసం కాదనిపించింది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత స్లో ఓవర్ రేట్ కిందకు వస్తే ఓవర్కు రెండు పాయింట్ల చొప్పున పాయింట్ల కోత ఉంటుంది. అందరు ఆటగాళ్లకు ఇది సమాన శిక్షగా ఉంటుంది' అని ఐసీసీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నో బాల్స్కు రీప్లేలో చూసే విషయంలోనూ క్రికెట్ కమిటీ సూచనలు చేసినా, ఐసీసీ దాన్ని పరిశీలనలో ఉంచింది.