Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడ్కోలుపై మాజీ సెలక్టర్ సంజరు
ఇండోర్ : అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికే నిర్ణయం తీసుకునే పరిణితి ఎం.ఎస్ ధోనికి ఉందని, ఈ విషయంలో అతడి నిర్ణయం కోసం ఎదురుచూడాలని బీసీసీఐ మాజీ కార్యదర్శి, మాజీ సెలక్టర్ సంజరు జగ్దాలె అభిప్రాయపడ్డాడు. తన కెరీర్ ఎప్పుడు ముగించాలనే విషయం అర్థం చేసుకునే పరిణితి ధోనికి ఉందని సంజరు తెలిపాడు. ' ధోని గొప్ప ఆటగాడు. ఎల్లప్పుడూ స్వార్థం లేకుండా జట్టు కోసమే ఆడాడు. నా అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం ధోని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు భారత జట్టులో లేడు. వీడ్కోలుపై నిర్ణయం తీసుకోగల పరిణితి ధోనికి ఉంది. కానీ సెలక్టర్లు ముందు ధోనితో మాట్లాడి, అతడి మనసులో ఏముందో తెలుసుకోవాలి. సచిన్ టెండూల్కర్ విషయంలో సెలక్టర్లు ఏం చేశారో, ధోని విషయంలోనూ అదే విధంగా జరగాలి. జాతీయ జట్టులో ధోని ఉండాలనుకుంటే, అతడి పాత్ర ఏ విధంగా ఉండాలని సెలక్టర్లు కోరుకుంటున్నారో ఆ విషయం అతడికి చెప్పాలి. ప్రపంచకప్లో జట్టు ప్రణాళికల ప్రకారమే ధోని ఆడాడు. సెమీఫైనల్లోనూ అదే వ్యూహంతో ఆడాడు. దురదృష్టశావత్తు కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. 38 ఏండ్ల ధోని నుంచి యువ ధోని మెరుపులు ఆశించటం సమంజసం కాదు' అని సంజరు అన్నాడు. ప్రపంచకప్కు ముందు రిషబ్ పంత్ను ధోనితో పాటు వన్డే జట్టుతో కొనసాగించి ఉంటే, అతడు మరింత మెరుగైన క్రికెటర్గా ప్రపంచకప్లో ఆడేవాడని సంజరు అభిప్రాయపడ్డాడు.