Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదం రేపుతోన్న సీఓఏ వైఖరి
ముంబయి : భారత క్రికెట్ను ఊపేస్తున్న విరుద్ధ ప్రయోజనాల అంశం సెగ తాజాగా జాతీయ జట్టుకు తాకుతోంది. 2019 ప్రపంచకప్కు ముందు పాలకుల కమిటీ (సీఓఏ) తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ వర్గాలతో పాటు జస్టిస్ ఆర్.ఎం లోధా సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచకప్కు ఆటగాళ్లు తమతో పాటు భార్యలు, ప్రియురాళ్లను తీసుకెళ్లటంపై నిర్ణయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు వదిలేశారు. ఓ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్న వారే, ఆ నిర్ణయం తీసుకోవటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు ఈ విషయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నా.. పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ ఈ అంశంలో నిర్ణయాధికారాన్ని జట్టు మేనేజ్మెంట్కు వదిలేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీసీసీఐ అంబుడ్స్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఈ సమయంలో నేను స్పందించటం బాగోదు అని జస్టిస్ ఆర్ఎం లోధా పేర్కొన్నారు. రెండేండ్లు గడుస్తున్నా, నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినా బోర్డు పరిపాలనలో మార్పులు కనిపించకపోవటం పట్ల లోధా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరలో జరుగబోయే సార్వత్రిక సమావేశంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.