Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెన్, ఉమెన్ జట్ల విజయాలు
కటక్ (ఒడిశా) : కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత మెన్స్ జట్టు టైటిల్ నిలుపుకుంది. కటక్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి హౌస్ట్ అసోసియేషన్ కప్ను సొంతం చేసుకుంది. భారత్కు చెక్ పెట్టి టైటిల్ సాధించాలని స్వప్పించిన ఇంగ్లాండ్ గట్టి పోటీనిచ్చింది. 3-2తో ఉత్కంఠ విజయం సాధించిన భారత పురుషుల జట్టు వరుసగా రెండోసారి విజయం సాధించింది. చివరి మ్యాచ్లో బర్త్డే బారు హర్మీత్ దేశారు మెరుపులతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు వరుసగా ఎనిమిదిసార్లు చాంపియన్ సింగపూర్కు భారత మహిళల జట్టు షాకిచ్చింది. 1997 నుంచి తిరుగులేని చాంపియన్గా నిలుస్తున్న సింగపూర్ను 3-0తో చిత్తు చిత్తుగా ఓడించింది. అర్చన గిరీశ్, మోనిక బత్రా, మధురికలు వరుస విజయాలతో మహిళల జట్టును విజేతగా నిలిపారు.